ఓటమి భయంతోనే బీఆర్ఎస్ ​దూరం

ఓటమి భయంతోనే బీఆర్ఎస్ ​దూరం
  • తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం

జూబ్లీహిల్స్, వెలుగు: ఓడిపోతామనే భయంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయట్లేదని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ ​నేత గజ్జెల కాంతం విమర్శించారు. బుధవారం ఆయన బంజారాహిల్స్​లో మీడియాతో మాట్లాడారు. పదేండ్ల పాలనలో బీఆర్ఎస్​నేతలు రాష్ట్రాన్ని ఎంతగా దోచుకున్నారో ప్రజలకు తెలుసన్నారు. 

ఓడిపోతామనే  టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ​ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టలేదన్నారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసమే బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుందని ఆయన ఆరోపించారు. అవినీతి కేసుల్లో కవిత, హరీశ్​, కేటీఆర్​ జైలుకు పోవడం ఖాయమన్నారు.