ఎమ్మెల్యే  పాయల్ శంకర్ కు అభివృద్ధిపై విజన్ లేదు : మాజీ మంత్రి జోగు రామన్న 

ఎమ్మెల్యే  పాయల్ శంకర్ కు అభివృద్ధిపై విజన్ లేదు : మాజీ మంత్రి జోగు రామన్న 

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు:  పాయల్​ శంకర్‌‌ ఎమ్మెల్యేగా గెలిచాననే అహం తప్పా..  అభివృద్ధిపై విజన్ లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. ఆయన విధానాల వల్లే బీజేపీ నాయకులు పార్టీని వీడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు జోగు రామన్న ఆధ్వర్యంలో బీఆర్‌‌ఎస్‌లో  చేరారు.  ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. తాను మంత్రిగా రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధితో  పనిచేశానే తప్పా..  నీచ రాజకీయాలకు ఎప్పుడు పాల్పడలేదని అన్నారు.  

బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉండి పాయల్  శంకర్, జడ్పీ మాజీ చైర్మన్​ సుహాసిని రెడ్డి  రైతులను రెచ్చగొడుతూ నీచ రాజకీయాలు చేశారని విమర్శించారు.  బీజేపీ టౌన్ సెక్రటరీ భగత్ నరేశ్​, సోషల్ మీడియా కన్వీనర్ రాచర్ల శరత్ తో పాటు పలువురు బీఆర్‌‌ఎస్​లో చేరారు. ఇకనైనా బీజేపీ నాయకులు నీచ రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ఇజ్జగిరి నారాయణ, అజయ్, సలీం, శ్రీనివాస్, కుమ్ర రాజు, కొండ గణేశ్​, కోవా రవి, నల్ల మహేందర్, మహేశ్​, తదితరులు పాల్గొన్నారు.