రేవంత్.. నా కొడుకుల ఫాంహౌస్​లు ఎక్కడున్నయో చూపించు

రేవంత్.. నా కొడుకుల ఫాంహౌస్​లు ఎక్కడున్నయో చూపించు
  • అక్రమంగా నిర్మించి ఉంటే కూల్చెయ్​: మాజీ మంత్రి సబితారెడ్డి

చేవెళ్ల, వెలుగు: తన కొడుకులకు మూడు ఫాంహౌస్​లు ఉన్నాయని ఆరోపించిన సీఎం రేవంత్​రెడ్డి.. అవి ఎక్కడున్నాయో చూపించాలని మాజీ మంత్రి సబితారెడ్డి సవాల్​విసిరారు. నిజంగా ఫాం హౌస్​లు ఉండి.. అవి అక్రమంగా నిర్మించుకున్నట్టయితే కూల్చేసుకోవాలని సూచించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్లలో ఆమె మీడియాతో మాట్లాడారు. 

‘‘హరీశ్​రావు ఫాంహౌస్​కూల్చాల్నా.. వద్దా, కేటీఆర్​ ది కూల్చాల్నా.. వద్దా, సబితమ్మది కూల్చాల్నా.. వద్దా, కేవీపీది కూల్చాల్నా.. వద్దా అంటున్నవ్.. నిన్ను ఎవరు వద్దంటున్నరు. నేనే చెప్పిన అక్కడ మా అబ్బాయి ఇల్లు కడుతున్నడని. డీవియేషన్​ఉంటే చెప్పాలె. అది ఇల్లు.. ఫాంహౌస్​ కాదు. ఎంక్వైరీ చేయండి. ఆక్రమణలో ఉంటే కూల్చండి’ అని సబిత అన్నారు. రేవంత్​రెడ్డి డైవర్షన్​పాలిటిక్స్ చేస్తున్నాడన్నారు. మూసీ ప్రక్షాళనతో చాలా మంది పేదలు రోడ్డున పడుతున్నారన్నారు. బీఆర్​ఎస్​లీడర్​కార్తీక్​ రెడ్డి మాట్లాడుతూ.. చేవెళ్ల–హైదరాబాద్​ నేషనల్​హైవే రోడ్డు పనులు ప్రారంభించకపోతే ఉద్యమిస్తామన్నారు. ఆ తర్వాత సబితా రెడ్డి భర్త ఇంద్రారెడ్డి జయంతి సందర్భంగా గ్రామంలోని ఆయన సమాధి వద్ద నివాళులర్పించారు.