
ములుగు(మర్కుక్), వెలుగు: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో గురువారం బీఆర్ఎస్ ఓడిపోయిన నేతలు, కళాకారులు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ను కలిసి పలు విషయాలపై చర్చించారు. అనంతరం ఎంపీ సంతోష్ కుమార్ కి పుట్టినరోజు సందర్భంగా పాములపర్తి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు భేతి సంజీవరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
ALSO READ:-తెలంగాణ నూతన కేబినెట్లో మిగిలిన 6 బెర్తుల్లో..ఎవరికి చాన్స్?