
- దేవన్నపేట పంపు హౌజ్ ను పరిశీలన
హనుమకొండ / ధర్మసాగర్, వెలుగు: దేవాదుల ప్రాజెక్టు కింద ఎండిపోయిన ప్రతి ఎకరానికి రూ.25 వేల నష్ట పరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. వెంటనే దేవన్నపేట పంప్హౌజ్ను ప్రారంభించి, నీటిని విడుదల చేయాలని కోరారు. దేవాదుల ప్రాజెక్టు థర్డ్ఫేజ్లోని దేవన్నపేట పంప్హౌజ్ను ఆదివారం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్నేతలు ఎర్రబెల్లి దయాకర్రావు, తాటికొండ రాజయ్య, పెద్ది సుదర్శన్రెడ్డి, వినయ్భాస్కర్, ఏనుగుల రాకేశ్రెడ్డి వేర్వేరుగా సందర్శించారు.
పంప్హౌజ్ పనులు ఏడాదిన్నర కిందటే పూర్తయ్యాయని, ఎన్నికల కోడ్తో ప్రారంభించలేక పోయామని మాజీ మంత్రి దయాకర్రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా ప్రారంభించకపోవడంతో పంట పొలాలు దెబ్బతిన్నాయని విమర్శించారు. దేవాదుల నుంచి నీళ్లు విడుదల చేయకపోవడంతోనే రూ.600 కోట్ల వరకు పంట నష్టం జరిగిందిని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
పంప్ హౌజ్ వద్ద టెన్షన్
మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పిలుపు మేరకు బీఆర్ఎస్నేతలు ముట్టడికి వస్తున్నారనే సమాచారంతో పోలీసులు దేవన్నపేట పంప్ హౌజ్ వద్ద ఉదయం నుంచే బందోబస్తు కొనసాగించారు. ముందుగా మాజీ మంత్రి దయాకర్రావు తదితర నేతలు రాగా పోలీసులు అడ్డుకున్నారు. తాము ఆందోళన చేయమని చెప్పడంతో రెండు విడతల్లో పంప్హౌజ్సందర్శనకు అనుమతించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డితో పాటు రాజయ్య ఇతర నేతలు సందర్శించారు.
లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్అడ్వైజర్ పెంటారెడ్డి, దేవాదుల ఎస్ఈ వెంకటేశ్వర్లుతో మాట్లాడి.. వెంటనే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని కోరారు. రాత్రికల్లా మోటార్లు ఆన్చేసి ధర్మసాగర్ రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు బదులిచ్చారు. కాగా.. పంప్ హౌజ్సందర్శన సందర్భంగా బీఆర్ఎస్ నేతల్లో విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, నేతలు రాజయ్య, అనంతరం ఎర్రబెల్లి తదితర నేతలు వేర్వేరుగా వెళ్లడంతో ఇరువర్గాల మధ్య ఐక్యతాలోపం కనిపించింది.