రైతు భరోసా ఇవ్వాలని ధర్నాలు, రాస్తారోకోలు

రైతు భరోసా ఇవ్వాలని ధర్నాలు, రాస్తారోకోలు

న్యూస్​నెట్​వర్క్, వెలుగు: ఉమ్మడి మెదక్​జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని బీఆర్​ఎస్​నేతలు ఆదివారం ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని దౌల్తాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే సునీతా రెడ్డి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. జిన్నారం మండల కేంద్రంలో ని అంబేద్కర్​చౌరస్తా వద్ద బీఆర్ఎస్​నాయకులు ధర్నా నిర్వహించి, అంబేద్కర్​ విగ్రహానికి వినతిపత్రం అందించారు. 

మెదక్​పట్టణం, పాపన్నపేట మండల కేంద్రాల్లో  బీఆర్ఎస్​జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ధర్నా నిర్వహించారు. తూప్రాన్​బస్టాండ్​వద్ద ఎఫ్డీసీ మాజీ చైర్మన్​వంటేరు ప్రతాప్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​అంబేద్కర్​చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్​కుమార్​బీఆర్​ఎస్​కార్యకర్తలతో కలిసి రాస్తారోకో చేశారు. ఆయా కార్యక్రమాల్లో  బీఆర్ఎస్​రాష్ట్ర నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.