![వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు](https://static.v6velugu.com/uploads/2025/02/brs-leaders-join-congress-party-in-warangal-district_Eynf9YsQXN.jpg)
రాయపర్తి, వెలుగు : వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని బీఆర్ఎస్నాయకులు సోమవారం కాంగ్రెస్పార్టీలో చేరారు. హైదరాబాద్ గాంధీభవన్లో టీపీసీసీ వర్కింగ్ప్రెసిడెంట్అజారుద్దీన్, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, నియోజకవర్గ ఇన్ చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్జిల్లా నాయకులు బిల్లా సుధీర్రెడ్డి, మాజీ రైతు బంధు అధ్యక్షుడు ఆకుల సురేందర్రావు, మాజీ ఎంపీటీసీ కుంట వినోద ప్రభాకర్, మాజీ సర్పంచ్ చెవ్వు కాశీనాథంతోపాటు పలువురు నాయకులు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.
కాంగ్రెస్ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్అధ్యక్షుడు జాటోతు ఆమ్యానాయక్, పార్టీ మండలాధ్యక్షుడు ఈదులకంటి రవీందర్రెడ్డి, వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్కమిటీ వైస్ చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.