
ములుగు, వెలుగు: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఆయనను శుక్రవారం పలువురు బీఆర్ఎస్ నేతలు కలిశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు హరీశ్రావు, పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పట్లోళ్ల కార్తీక్రెడ్డి కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ఫార్ములా రేసింగ్కేసు, ఏసీబీ విచారణ, తాజా పరిణామాలపై కేసీఆర్తో చర్చించారు. గురువారం ఉదయం ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్హాజరైన విషయం అందరికి తెలిసిందే. అనంతరం పార్టీ వ్యవహారాలు, స్థానిక ఎన్నికలపై కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.