గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ శ్రేణుల వినతి

గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ శ్రేణుల వినతి

నెట్​వర్క్​వెలుగు : గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్​ పార్టీ ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని కోరుతూ గురువారం  కామారెడ్డి, నిజామాబాద్  జిల్లాల్లో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 

కామారెడ్డిలో పార్టీ టౌన్​ ప్రెసిడెంట్ జూకంటి ప్రభాకర్​రెడ్డి, యూత్​ ప్రెసిడెంట్​ చెలిమెల భానుప్రసాద్​ పాల్గొన్నారు. లింగంపేట, ఆర్మూర్, బాల్కొండ తదితర మండల కేంద్రాల్లో బీఆర్​ఎస్​ లీడర్లు మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించారు.