చిలుకూరి టెంపుల్​ ప్రధాన అర్చకుడిని పరామర్శించిన బీఆర్​ఎస్​ నేతలు

చిలుకూరి టెంపుల్​ ప్రధాన అర్చకుడిని పరామర్శించిన బీఆర్​ఎస్​ నేతలు

చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్​ సౌందర్యను బీఆర్​ఎస్​ నేతలు కేటీఆర్,  సబితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, పట్లోళ్ల కార్తీక్ రెడ్డి పరామర్శించారు.    రంగరాజన్​ సౌందర్య చిలుకూరి బాలాజీ దేవాలయంలో సేవలందిస్తున్నారని.. అలాంటి వారిపై దాడి జరిగిందంటే .. రాష్ట్రంలో శాంతిభద్రతలు అధోగతి పాలయ్యాయని కేటీఆర్​ అన్నారు.   దేవాలయ అర్చకుడిపై  దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ... భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు  జరుగకుండా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్​ నేతలు  డిమాండ్​ చేశారు.

ALSO READ | నా ఇల్లు కూల్చొద్దు: ప్రజావాణిలో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి