పద్మారావునగర్, వెలుగు: నిరుద్యోగుల డిమాండ్ల సాధనకు ఐదు రోజులుగా గాంధీ ఆస్ప్రత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఓయూ నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్నాయక్ను శుక్రవారం సాయంత్రం బీఆర్ఎస్నేత ఆర్ఎస్ప్రవీణ్ కుమార్ పరామర్శించి మద్దతు తెలిపారు.
మోతీలాల్ నాయక్ఆమరణ దీక్షపై ప్రభుత్వం స్పందించి, నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు. మరో బీఆర్ఎస్నేత దాసరి ఉష, సేవాలాల్జాతీయ అధ్యక్షుడు భూక్య సంజీవ్కుమార్, జనసేన గిరిజన విభాగం రాష్ర్ట అధ్యక్షుడు సంపత్ కుమార్ ఉన్నారు.