గాంధీ ఆస్పత్రిలో మోతీలాల్ కు బీఆర్ ఎస్ నేతల పరామర్శ

గాంధీ ఆస్పత్రిలో మోతీలాల్ కు బీఆర్ ఎస్ నేతల పరామర్శ

పద్మారావునగర్​, వెలుగు: నిరుద్యోగుల డిమాండ్ల సాధనకు ఐదు రోజులుగా గాంధీ ఆస్ప్రత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఓయూ నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్​నాయక్​ను శుక్రవారం సాయంత్రం బీఆర్ఎస్​నేత ఆర్ఎస్​ప్రవీణ్ కుమార్​ పరామర్శించి మద్దతు తెలిపారు. 

మోతీలాల్​ నాయక్​ఆమరణ దీక్షపై ప్రభుత్వం స్పందించి, నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు. మరో బీఆర్ఎస్​నేత దాసరి ఉష, సేవాలాల్​జాతీయ అధ్యక్షుడు భూక్య సంజీవ్​కుమార్​, జనసేన గిరిజన విభాగం రాష్ర్ట అధ్యక్షుడు సంపత్ కుమార్​ ఉన్నారు.