మూసీ నిర్వాసితుల కోర్టు ఖర్చులకు 15 కోట్లు : పార్టీ ఫండ్​ నుంచి కేసీఆర్​ కేటాయించారు: ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి

మూసీ నిర్వాసితుల కోర్టు ఖర్చులకు 15 కోట్లు : పార్టీ ఫండ్​ నుంచి కేసీఆర్​ కేటాయించారు: ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి

ఎల్బీనగర్, వెలుగు: మూసీ నిర్వాసితు లు న్యాయ సహాయం కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకోవద్దని, తెలం గాణ భవన్​లో ఏర్పాటు చేసిన లీగల్ టీమ్​ను ఆశ్రయించాలని ఎల్బీనగర్ బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ‘‘కోర్టు ఖర్చుల కోసం పార్టీ ఫండ్ నుంచి కేసీఆర్ రూ.15 కోట్లు కేటాయించారు” అని ఆయన తెలిపారు.

హైదరాబాద్​లోని కొత్త పేట, చైతన్యపురిలో మూసీ ఏరియా ప్రజలతో ఆదివారం సుధీర్​రెడ్డి సమావేశమయ్యారు. ‘‘మీకు వచ్చిన ఆపద ఏమీ లేదు. బీఆర్ఎస్ అండగా ఉంటుంది. మీ ఇండ్లు కూల్చాలంటే ముందు మమ్మల్ని దాటాలి” అని అక్కడి వారితో ఆయన అన్నారు.