
హైదరాబాద్, వెలుగు: ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి పది రోజులవుతున్నా పైసా పని జరగలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సోయి లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. సోమవారం తెలంగాణభవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు.
శ్రీశైలం హైడల్ పవర్ ప్రాజెక్టులో ప్రమాదం జరిగితే తామెవరం వెళ్లలేదంటూ సీఎం చిల్లర మాటలు మాట్లాడారని, ప్రమాద వార్త తెలిసిన వెంటనే నిమిషాల్లోనే తాము అక్కడకు వెళ్లామన్నారు. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.