హైదరాబాద్​ సిటీకి బడ్జెట్​లో అన్యాయం : కేపీ వివేకానంద్​

హైదరాబాద్​ సిటీకి  బడ్జెట్​లో అన్యాయం : కేపీ వివేకానంద్​

హైదరాబాద్, వెలుగు: బడ్జెట్​లో హైదరాబాద్ ​సిటీకి అన్యాయం జరిగిందని బీఆర్ఎస్​ఎమ్మెల్యే కేపీ.వివేకానంద అన్నారు. కోటి జనాభా ఉన్న హైదరాబాద్​సిటీపై కాంగ్రెస్​సర్కారు పగబట్టిందని, అంత మంది జనాభా ఉండి కూడా ఒక్క మంత్రి లేకపోవడం అన్యాయమని విమర్శించారు. ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలిపించలేదని ప్రజలపై సీఎం రేవంత్​రెడ్డి కోపంగా ఉన్నారని ఆరోపించారు. గురువారం ఆయన తెలంగాణభవన్​లో మీడియాతో మాట్లాడారు. బడ్జెట్​తో భట్టి ప్రజలను పక్కదారి పట్టించారని ఫైర్ అయ్యారు. సిటీలో డ్రైనేజీ సిల్ట్​తీయడంపై కూడా భట్టి అబద్ధాలు చెప్పారని విమర్శించారు. 

హైదరాబాద్​సిటీకి చేసిన అన్యాయంపై సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ఢిల్లీకి డబ్బులు పంపే పనిలో కాంగ్రెస్​ నేతలు బిజీగా ఉన్నారని తెలిపారు. సిటీలో మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్​ నియంత్రణకు చర్యలు తీసుకోలేదన్నారు. గాంధీ, ఉస్మానియా లాంటి పేదల ఆసుపత్రులకు నిధులు కేటాయించలేదని విమర్శించారు. మెట్రోపై స్పష్టమైన ప్రకటన చేయలేదన్నారు. ఫోర్త్​ సిటీ పేరుతో భూ దందాలు చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు