
- యాదాద్రి గుడి, అంబేద్కర్ విగ్రహం కట్టిందెవరు: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: టూరిజం అభివృద్ధికి మేం ఏమీ చేయలేదని మంత్రి మాట్లాడడం సరికాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. మంగళవారం అసెంబ్లీలో పర్యాటక శాఖపై మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన ప్రసంగంలో కొన్ని అంశాలపై కేటీఆర్ క్లారిఫికేషన్ అడిగారు. ‘‘రామప్ప దేవాలయానికి యునెస్కో హెరిటేజ్ గుర్తింపు తెచ్చేందుకు కృషి చేశాం. కులీకుతుబ్షా టూంబ్స్ రీక్రియేషన్ చేశాం, యాదాద్రి గుడి, మొజం జాహీమార్కెట్ను తీర్చిదిద్దాం.
ముర్గీచౌక్, మీర్ ఆలం ట్యాంక్ రీస్టోర్ చేశాం” అని కేటీఆర్ పేర్కొన్నారు. గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ నిర్వహించామని తెలిపారు. 200 ఎకరాల్లోని బుద్ధవనం ప్రాజెక్ట్ను జాతికి అంకితం చేశామన్నారు. కొల్లాపూర్ లో సోమశిలలో రిసార్ట్లు కట్టామని తెలిపారు. 125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం పెట్టామన్నారు. తాము నిర్మించిన అమరవీరుల జ్యోతిని టూరిజం డెవలప్మెంట్ కు వాడుకోవడం లేదన్నారు.