బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు అరెస్ట్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు అరెస్ట్

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు  ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  సోదరుడు బీఆర్ఎస్ నేత మధుసూదన్ రెడ్డి  అరెస్టయ్యారు.  అక్రమ మైనింగ్ కేసులో మార్చి 15న  తెల్లవారుజామున మధుసూదన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పరిమితికి మించి అక్రమ మైనింగ్ చేశారని తహసీల్దార్ ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. చీటింగ్,  మైనింగ్ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

 నిన్న కేసీఆర్ అన్న కొడుకుపై కేసు

మాజీ సీఎం కేసీఆర్ ​అన్న కొడుకు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్​ కన్నారావుపై నిన్న రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్​స్టేషన్​లో అటెంప్ట్  టు మర్డర్​, భూ కబ్జా కేసు లు నమోదయ్యాయి. కన్నారావుతో పాటు ఆయన అనుచరులు, పలువురు బీఆర్​ఎస్ నాయకులపై కూడా ఈ కేసులు ఫైల్​ అయ్యాయి.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్  మండలం మన్నెగూడ  సర్వే నెంబర్ 32/ఆర్​యూయూ లో ఓఆర్ఎస్ ప్రాజెక్ట్స్​ సంస్థకు చెందిన రెండు ఎకరాల ప్రైవేట్ భూమిని కబ్జా చేసేందుకు కల్వకుంట్ల కన్నా రావు గ్యాంగ్ ప్రయత్నించిందని సంస్థ డైరెక్టర్ బండోజు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. కన్నారావు ఈ నెల 3న ఉదయం 7 గంటలకు 150 మంది దుండగులు, జేసీబీతో తమ కంపెనీ ల్యాండ్ లోకి వచ్చి ఫెన్సింగ్ తొలగించి హద్దు రాళ్లు పాతారని, భూమి చుట్టూ ఉన్న ఫ్రీ కాస్ట్ వాల్స్ ను కూల్చివేశారని ఫిర్యాదులో బండోజు శ్రీనివాస్​ పేర్కొన్నారు.

అదేవిధంగా ఆ భూమిలోని గుడిసెకు నిప్పు పెట్టి కాల్చారని, అక్కడ ఉన్న ల్యాండ్ టేకర్స్ పై దాడికి దిగారని తెలిపారు. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కన్నా రావుతో పాటు 38 మంది బీఆర్ఎస్ నాయకులపై ఐపీసీ సెక్షన్లు 307, 447, 427, 436, 148, 149 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీబీ డ్రైవర్, ఓనర్ తో పాటు ఐదుగురిని రిమాండ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.