బండి సంజయ్ ఓ చిల్లర వ్యక్తి

బండి సంజయ్ ఓ చిల్లర వ్యక్తి
  • కేసీఆర్​పై అనుచిత వ్యాఖ్యలు చేసిండు
  • చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ దాసోజు పోలీసులకు ఫిర్యాదు

జూబ్లీహిల్స్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్​పై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్​ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కోరారు. సోమవారం బంజారాహిల్స్ ఇన్​స్పెక్టర్​రాఘవేంద్రను కలిసి ఫిర్యాదు అందజేశారు. బండి సంజయ్​చిల్లర వ్యక్తిలా మాట్లాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

కేసీఆర్​కు కర్నాటకలోని బీదర్​లో నోట్ల ప్రింటింగ్​ప్రెస్​ఉందంటూ బండి సంజయ్ చేసిన ఆరోపణల వెనుక ఎవరున్నారని ప్రశ్నించారు. కేంద్రమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఎలాంటి చేసినా వాటిని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. దాసోసు శ్రవణ్​వెంట బీఆర్ఎస్​నేతలు గెల్లు శ్రీనివాస్, మన్నె గోవర్ధన్​రెడ్డి, వెల్దండి వెంకటేశ్ ఇతర బీఆర్ఎస్​ నేతలు ఉన్నారు.