
- ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, వెలుగు: మహిళా సంక్షేమాన్ని మరచిపోయిన కేంద్ర ప్రభుత్వం.. గ్యాస్ ధరను రూ.50 పెంచి గుదిబండమోపిందని బీఆర్ఎస్ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతుంటే ఇక్కడ మాత్రం పెట్రోలియం ఉత్పత్తులపై ధరలు పెంచడమేంటని నిలదీశారు. బుధవారం తెలంగాణ మహిళా సాధికారత సమాఖ్య సంఘం సభ్యులు కవితను ఆమె నివాసంలో కలిశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. మహిళా సంఘాలకు కేంద్రం రూ.15 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీలకు రూ.16.5 లక్షల కోట్లు మాఫీ చేసిన కేంద్రానికి మహిళలకు ఇచ్చేందుకు మాత్రం మనసు రావడం లేదని మండిపడ్డారు.