రైతు భరోసా కోసం బీఆర్ఎస్​ ఆందోళన

రైతు భరోసా కోసం బీఆర్ఎస్​ ఆందోళన

చేవెళ్ల/షాద్ నగర్/ పరిగి, వెలుగు: రైతు భరోసా విడుదల చేయాలంటూ బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళనకు దిగారు. షాబాద్లో మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్ రెడ్డి నిర్వహించిన ధర్నాకు బీఆర్ఎస్ లీడర్​ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి హాజరయ్యారు. చేవెళ్లలో డీసీఎంఎస్​ చైర్మన్​ పట్లోళ్ల కృష్ణారెడ్డిని సీఐ భూపాల్​ శ్రీధర్​ అదుపులోకి తీసుకున్నారు. షాద్ నగర్​లో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, పరిగిలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి ధర్నా చేపట్టారు.