
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో కరెంట్ కోతలు కామన్ అయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో మళ్లీ చీకట్లు మొదలయ్యాయని తెలిపారు. విద్యుత్ రంగంలో బీఆర్ఎస్ సృష్టించిన సదుపాయాలను సరిగ్గా వాడుకోలేని అసమర్థ స్థితిలో రేవంత్సర్కార్ఉన్నదని ఫైర్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్రంలో విద్యుత్ కోతలపై కేటీఆర్ శనివారం ట్వీట్ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ట్యాగ్ చేస్తూ నెటిజన్ల ట్వీట్లను ఆయన రీట్వీట్ చేశారు.
‘‘2014కు ముందు తరుచూ విద్యుత్ కోతలు, పవర్ హాలిడేస్మనకు తెలిసిందే. ఆ పరిస్థితిని మార్చేసిన ఘనత కేసీఆర్ సర్కార్ది. 24 గంటల నాణ్యమైన కరెంటు సరఫరా చేయడం వల్ల హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోయింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పదేండ్ల క్రితం నాటి రోజులను తిరిగి తీసుకొచ్చింది. విద్యుత్ కోతలతో ప్రజలకు, పరిశ్రమలకు ఇబ్బంది తీసుకొస్తోంది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.