
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పాలనలో ఊదు కాలింది లేదు.. పీరు లేచింది లేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి వచ్చాక హామీలన్నింటినీ అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని, సంపద సృష్టించి ప్రజలకు పంచుతామంటూ ప్రగల్భాలు పలికిందని ఆయన వ్యాఖ్యానించారు.
తీరా ఇప్పుడు వాటిని అమలు చేయడం లేదని శనివారం ఎక్స్లో ఆయన మండిపడ్డారు. నెలకు సగటున రూ.10 వేల కోట్ల చొప్పున రూ.లక్షన్నర కోట్ల అప్పు తెచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారికంగా ఒప్పుకున్నదని తెలిపారు. అయినా కూడా రుణమాఫీ కాలేదని, రైతు భరోసా రాలేదని, రైతు బీమా ప్రీమియం కట్టలేదన్నారు. కనీసం పంటలనూ కొంటలేదని విమర్శించారు.