
భద్రాచలం, వెలుగు: భద్రాచలంలో బీఆర్ఎస్యువజన నాయకుడు సెటిల్మెంట్సత్తి అలియాస్ కె.సతీశ్కుమార్ గురువారం ఉదయం ఓ బాలికను ట్రాప్చేసి బ్రిడ్జి పాయింట్లోని ఓ లాడ్జీకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. లాడ్జీలోకి తీసుకెళ్తుండగా కొందరు చూసి బాలిక కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని సతీశ్ను చితకబాది పీఎస్లో అప్పగించారు. ఐద్వా సంఘం మహిళా నేతలు, సీపీఎం లీడర్లు భద్రాచలం పీఎస్కు చేరుకుని ఆందోళన చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీకి చెందిన యువజన నాయకుడు కావడంతో కేసు కాకుండా ఒత్తిడి తెస్తున్నారంటూ ఆరోపించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సోతో పాటు అత్యాచారం కేసు నమోదు చేశామని సీఐ నాగరాజురెడ్డి తెలిపారు.
సతీశ్ గతంలో ఓ యువతిని పెండ్లి చేసుకోగా ఆమె అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఈ ఘటనలో సతీశ్పై కేసు నమోదైంది. ఘటన జరిగిన తర్వాత సోషల్ మీడియాలో సతీశ్ను కఠినంగా శిక్షించాలని పోస్టింగులు పెట్టడంతో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అరికెల తిరుపతిరావు స్పందించారు. సతీశ్కు పార్టీకి ఇకపై సంబంధం లేదని ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చిన వెంటనే ప్రతిపక్షాలు సతీశ్ బీఆర్ఎస్ లీడర్లతో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్ చేశారు. జిల్లా మంత్రి పువ్వాడ అజయ్కుమార్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ విప్రేగా కాంతారావుతో దిగిన ఫొటోలను వైరల్ చేశారు.