బోరబండలో దారుణ హత్య: రాళ్లతో కొట్టి, కత్తులతో పొడిచి చంపి పరారయ్యారు..

బోరబండలో దారుణ హత్య: రాళ్లతో కొట్టి, కత్తులతో పొడిచి చంపి పరారయ్యారు..

హైదరాబాద్:  బోరబండ పీఎస్​పరిధిలో అర్ధరాత్రి దారుణహత్య జరిగింది. శివాజీనగర్ కు చెందిన భాను అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి, కత్తులతో పొడిచి చంపారు.  హత్య చేసి నిందితులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. 

పాతకక్షల కారణంగానే భాను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  మృతుడు భానుపై గతంలో పలు పోలీస్​స్టేషన్​లో కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. డెడ్​బాడీని పోలీసులు పోస్టుమార్టం కోసం హాస్పిటల్​కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.