ఉగాండాలో జనగామ జిల్లా వాసి దారుణ హత్య...

ఉగాండాలో జనగామ జిల్లా వాసి దారుణ హత్య...

జనగామ జిల్లాకు చెందిన వ్యక్తి ఉగాండాలో దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లా కేంద్రానికి చెందిన ఇటికల తిరుమలేష్ అనే వ్యక్తి ఉగాండాలోని ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో ప్రాజెక్ట్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. 2014లో భార్య కుమారుడితో కలిసి వెళ్లిన తిరుమలేష్  ఉగాండాలోని కంపాలా జిల్లాలో నివాసం ఉంటున్నాడు. అయితే ప్రాజెక్టు పని మీద పక్క జిల్లాకు వెళ్లిన తిరుమలేష్ అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు.

కాల్పుల్లో గాయపడ్డ తిరుమలేష్ అక్కడికక్కడే కుప్పకూలి మరణించినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ ఉన్నవారు సెక్యూరిటీ గార్డును పట్టుకునే ప్రయత్నం చేస్తుండగా.. సెక్యూరిటీ గార్డ్ కూడా తనను తాను కాల్చుకొని మృతి చెందినట్లు సమాచారం.తిరుమలేష్ మృతితో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి...