
- ప్రకటించిన మంత్రి సింధియా
న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ఈ ఏడాది జూన్లో 4జీ నుంచి 5జీకి మారుతుందని కేంద్రం ప్రకటించింది. అప్పటి వరకు సంస్థ లక్ష 4జీ టవర్ల సైట్మార్క్ను చేరుకుంటుందని కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ఇప్పటికే 89 వేల సైట్లను ఇన్స్టాల్చేశామని తెలిపారు. వీటిలో 72 వేల సైట్లు మొదలయ్యాయని, -జూన్ నాటికి అన్ని సైట్లు పనిచేసేలా చూస్తామని తెలిపారు. 5జీకి మారడానికి, అదనపు హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అప్గ్రేడ్లు అవసరమని మంత్రి వివరించారు.
చైనా, దక్షిణ కొరియా, ఫిన్లాండ్, స్వీడన్ మాదిరే ఇండియా కూడా సొంతగా 4జీ టెక్నాలజీని డెవెలప్చేసుకుందని పేర్కొన్నారు. సెజ్ల మాదిరిగానే టెలికం మాన్యుఫాక్చరింగ్ జోన్లనూ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని తెలిపారు. వీటిలోని టెస్టింగ్, సర్టిఫికేషన్ సదుపాయాలు దేశీయంగా టెలికం పరికరాల ఉత్పత్తిని పెంచుతాయని సింధియా పేర్కొన్నారు.