BSNL యూజర్లకు గుడ్ న్యూస్.. పైసా ఖర్చులేకుండా 500కి పైగా లైవ్ ఛానెల్స్, పేటీవీ ఆప్షన్లు

BSNL యూజర్లకు గుడ్ న్యూస్.. పైసా ఖర్చులేకుండా 500కి పైగా లైవ్ ఛానెల్స్, పేటీవీ ఆప్షన్లు

ప్రభుత్వ యాజమాన్యంలోని BSNL కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో 5G  సేవలను ప్రారంభించననున్న ఈ టెలికం కంపెనీలు డెవలప్ మెంట్ లో భాగంగా కొత్త లోగోను అవిష్కరించింది.దీంతో పాటు మంగళవారం ( అక్టోబర్ 22)  BSNL ఏడు కొత్త ఫీచర్లను  ప్రారంభించింది. 

BSNL ఇప్పటికే దేశంలో ఎంపిక చేసిన సర్కిళ్లలో 4G సేవలను అందిస్తోంది.  BSNL తన వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేందుకు అనేక కొత్త కొత్త ఫీచర్లను అందిస్తోంది. ఇందులో భాగంగా అన్ వాంటెడ్ కాల్స్, మెసేజ్ లను అరికట్టేందుకు స్పామ్ ఫ్రీ నెట్ వర్క్ ను తీసుకొచ్చింది. 

BSNL మంగళశారం ఏడు కొత్త ఫీచర్లను  ప్రారంభించింది.  ఫైబర్ ఇంటర్నెట్ వినియోగదారుల కోసం నేషనల్  WiFi రోమింగ్ సేవలను లాంచ్ చేసింది. అంటే కస్టమర్లు అదనపు ఛార్జీలు లేకుండా BSNL హాట్ స్పాట్ లలో హైస్పీడ్ ఇంటర్నరెట్ను  పొందవచ్చు. 

ALSO READ | 2030 నాటికి 120 కోట్ల స్మార్ట్​ఫోన్లు

దీంతోపాటు BSNL 500కి పైగా లైవ్ ఛానెల్స్, పేటీవీ ఆప్షన్లతో కొత్తంగా ఫైబర్ టీవీ సర్వీస్ ను ప్రకటించింది. ఇది ఫైబర్ ఇంటర్నెట్ సబ్ స్క్రైబర్లందరికి అదనపు ఖర్చు లేకుండా అందిస్తోంది. అంతేకాదు కొత్త సిమ్ కార్డులను కొనుగోలు చేసేందుకు ఆటోమేటెడ్ కియోస్క్ లను పరిచయం చేస్తుంది. 

BSNL దేశంలో మొట్టమొదటి డైరెక్ట్ టు డివైజ్  (D2D) కనెక్టివిటీ సొల్యూషన్ ను ప్రారంభించింది. ఇది శాటిలైట్, మొబైల్ నెట్ వర్క్ లను కలుపుతుంది. ఈ కొత్త సర్వీస్ అత్యవసర పరిస్థితుల్లో , మారుమూల ప్రాంతాలకు చాలా కీలకమైనది. సాధారణ కనెక్టివిటీ లేని ప్రదేశాల్లో కూడా డిజిటల్ పేమెంట్స్ నిర్వహించవచ్చు.