బీఎస్పీ నేతలను గాడిదలపై ఊరేగించిన కార్యకర్తలు 

బీఎస్పీ నేతలను గాడిదలపై ఊరేగించిన కార్యకర్తలు 

నమ్మక ద్రోహం చేస్తే దాని పరిణామం ఎంత తీవ్రంగా ఉంటుందో చూపించారు ఆ పార్టీ కార్యకర్తలు. పార్టీ టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలపై ఇద్దరు  BSP నేతల ముఖాలకు నల్లరంగు పూసి, మెడలో చెప్పుల దండ వేసి గాడిదలపై ఊరేగించారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగింది. BSP జాతీయ కార్యదర్శి రాంజీ గౌతమ్, రాష్ట్ర మాజీ ఇన్‌చార్జ్ సీతారాంలకు ఈ పరాభవం జరిగింది. వీరిద్దరూ పార్టీ టికెట్లను అమ్ముకున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. బనిపార్క్‌లోని పార్టీ కార్యాలయం దగ్గర వీరిని పట్టుకున్న కార్యకర్తలు ముఖాలకు నల్లరంగు పూసి, మెడలో చెప్పుల దండ వేసి ఇద్దరినీ గాడిదలపై కూర్చోబెట్టి ఊరేగించారు.

పార్టీ కోసం పనిచేస్తున్న వారిని నేతలు విస్మరిస్తున్నారని ఆరోపించారు కార్యకర్తలు. పార్టీని నమ్ముకుని ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని కాదని, బయట నుంచి వచ్చిన వారికి టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. తాము ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినిపించుకోలేదని, సమస్య అధినేత్రి మాయావతి వరకు వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అందుకనే వారిని గాడిదలపై ఊరేగించాల్సి వచ్చిందని తెలిపారు.

ఈ విషయంపై తీవ్రంగా స్పందిచారు మాయవతి. ఇది సిగ్గుపడాల్సిన విషయమని..దీనిపై విచారణ జరిపిస్తామని తెలిపారు.