బొగత వాటర్​ఫాల్​లో విద్యార్థి మృతి

బొగత వాటర్​ఫాల్​లో విద్యార్థి మృతి
  • ములుగు జిల్లా వాజేడు మండలంలో ఘటన  

వెంకటాపురం, వెలుగు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం వద్ద స్నానం చేస్తూ ఓ బీటెక్ ​విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. వెంకటాపురం సీఐ బండారి కుమార్, వాజేడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చంద్రమౌళి కథనం ప్రకారం..వరంగల్ జిల్లా ఏనుమాముల మార్కెట్ సమీపంలోని సుందరయ్యనగర్ కు చెందిన బొనగాని జస్వంత్ (19) వాగ్దేవి కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.

మంగళవారం తన ఫ్రెండ్స్ ​సాయి, కిరణ్, నాగేంద్ర, సుశాంత్, వంశీ, గౌస్​తో కలిసి బొగత వాటర్​ఫాల్ ​చూడడానికి వచ్చాడు. అక్కడి సిబ్బంది వారిస్తున్నా వినకుండా  స్నానం చేయడానికి ఇద్దరు మిత్రులతో కలిసి దిగాడు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ముందు జస్వంత్ గల్లంతయ్యాడు. కాపాడానికి ప్రయత్నించిన మరో స్నేహితుడు గల్లంతు కాబోతుండగా అక్కడున్న సిబ్బంది కాపాడారు. సీఐతో పాటు, ఎస్సై తిరుపతి ​వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన కొద్దిదూరంలోనే మృతదేహాన్ని గుర్తించారు.