తెలంగాణలో ఎయిర్​పోర్టులు నిర్మించండి : ఎంపీ రఘురాం రెడ్డి

తెలంగాణలో ఎయిర్​పోర్టులు నిర్మించండి : ఎంపీ రఘురాం రెడ్డి

ఖమ్మం, వెలుగు: తెలంగాణకు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ఉందని, కొత్తగా మూడు గ్రీన్ ఫీల్డ్, మూడు బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్​పోర్టులు నిర్మించాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి పార్లమెంట్​లో ప్రస్తావించారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం ఆయన ఈ విషయంపై మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ , మహబూబాబాద్ లో గ్రీన్​ఫీల్డ్​ ఎయిర్​పోర్టులు, వరంగల్ అర్బన్ జిల్లా మామునూరు- , పెద్దపల్లి జిల్లా బసంత్​ నగర్ , ఆదిలాబాద్ జిల్లాలో బ్రౌన్​ ఫీల్డ్​ ఎయిర్​పోర్టులు ఏర్పాటు చేయాలని కోరారు.

హైదరాబాద్ నుంచి ఎక్కువ దూరంలో ఉన్న జిల్లాల కోసం కొత్త ఎయిర్ పోర్టులు నిర్మించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఎయిర్ పోర్టు అథారిటీ గతంలోనే సర్వేలన్నీ పూర్తి చేసి ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. పౌర విమానయాన శాఖ మంత్రి స్పందించాలని కోరారు.