చెత్త తెచ్చి పోసినోళ్లతోనే ఎత్తించారు!

చెత్త తెచ్చి పోసినోళ్లతోనే ఎత్తించారు!
  • ట్వీట్​ పెట్టిన వెంటనే స్పందించిన  బల్దియా సిబ్బంది

గండిపేట, వెలుగు: కొందరు ట్రక్కులో చెత్తను తెచ్చి గుడిమల్కాపూర్ ​కింగ్స్​ ప్యాలెస్​ ఫంక్షన్​ హాల్​సమీపంలో పోస్తుండగా ప్రముఖ న్యాయవాది బల్వంత్‌రెడ్డి వీడియో తీసి ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్​చేశాడు. జీహెచ్ఎంసీ కమిషనర్, సీఎంఓ, టీఎస్​పోలీస్, బల్దియా ఆఫీసర్లను ట్యాగ్​చేశారు. వెంటనే స్పందించిన బల్దియా అధికారులు డంప్‌ చేసి వెళ్లిన ఆటోను గుర్తించారు.

తిరిగి అదే ప్రాంతానికి రప్పించి, సదరు వ్యక్తులతో చెత్తను ఆటోలోకి ఎత్తించారు. వెంటనే స్పందించిన అధికారులకు బల్వంత్​రెడ్డి థ్యాంక్స్​చెప్పారు. మంగళవారం ఆ వీడియోలు సోషల్​మీడియాలో వైరల్​గా మారాయి.