చెన్నూర్ పట్టణంలో ప్రధాని దిష్టిబొమ్మ దహనం

 చెన్నూర్ పట్టణంలో ప్రధాని దిష్టిబొమ్మ దహనం

చెన్నూర్, వెలుగు: సింగరేణి, ఎల్ఐసీ మొదలైన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ చెన్నూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సింగరేణిని విచ్ఛిన్నం చేసేందుకు మోదీ కుట్ర పన్నుతున్నారని అందుకే దేశంలో బొగ్గు గనుల వేలం ప్రకటించారని అన్నారు. ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేస్తూ కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్రను మానుకోవాలని కోరారు.

నీట్ పేపర్ లీక్ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు పార్లమెంట్​లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై లేనిపోని ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. చెన్నూర్ టౌన్ ప్రెసిడెంట్ చెన్న సూర్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి చీర్ల సుధాకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు బాప గౌడ్, బషీర్,హేమంత్ రెడ్డి, సుశీల్ కుమార్, చింతల శ్రీనివాస్, పాతల నాగరాజు, కడవండి మహేశ్, బొడ్డు రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.