జమ్మూ కాశ్మీర్ అడవుల్లో కార్చిచ్చు.. కాలి బూడిదవుతున్న జంతువులు, పక్షులు

జమ్మూ కాశ్మీర్ అడవుల్లో కార్చిచ్చు.. కాలి బూడిదవుతున్న  జంతువులు, పక్షులు

జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరి జిల్లా అడవుల్లో కార్చిచ్చు అంటుకుంది. నిన్నటి నుంచి ఇంకా కంటిన్యూగా కిలో మీటర్ల మేర అడవులు కాలిపోతూనే ఉన్నాయి. ప్రధానంగా చింగూస్ బ్లాక్ సహా..నౌషెరా సబ్ డివిజన్ ఫారెస్టులో ఈ మంటలు అంటుకున్నాయి. మంటల కారణంగా స్థానిక గ్రామాల్లోకి దట్టమైన పొగ చేరుతోంది. దీంతో స్థానికలు, పిల్లలు, వృద్ధులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

స్థానికులు కూడా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మంటల్లో చిన్నపాటి జంతువులు, పక్షులు కాలి బూడిదవుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ...కార్చిచ్చు ఏ మాత్రం తగ్గడం లేదు. తమ వంతుగా ప్రయత్నం చేస్తున్నామన్నారు ఫైర్ సిబ్బంది. 

తమతో  పాటు స్థానికుల సహాయం కూడా తీసుకుంటున్నామన్నారు.  జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ప్రాంతంలో ఇప్పటికే ఎండలు రికార్డు స్థాయిలో  ఉన్నాయి. ఆ ఎండలకు తోడు.. ఈ మంటలు మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.