చైనాలో బస్సు ప్రమాదం: 20మంది మృతి

చైనాలో బస్సు ప్రమాదం: 20మంది మృతి

చైనా లోని ఓ మైనింగ్ టన్నెల్ లో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మంది చనిపోగా.. 30 మంది గాయపడ్డారు. నార్త్ చైనాలో ఉన్న జింక్, సిల్వర్ మైన్ లోకి 50మంది కార్మికులను తీసుకువెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. డైవరు బస్సుపై కంట్రోల్ తప్పడంతో.. టన్నెల్ గోడకు బస్సు గుద్దుకుంది. దీంతో 20 మంది కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడి మీడియా తెలిపింది. ప్రమాదం జరిగిన వెంటనే.. విపత్తు నిర్వహణా శాఖ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.