ఝార్కండ్ లో బస్సు ప్రమాదం.. ఐదుగురి మృతి

ఝార్కండ్ లో బస్సు ప్రమాదం.. ఐదుగురి మృతి

ఝార్కండ్ లో బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఓ చిన్నపిల్ల చనిపోగా.. 30 మంది గాయపడ్డారు. డియోగర్ జిల్లా కచ్యుతాబాద్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

దుమ్కా జిల్లాలో జరిగిన ఓ పొలిటికల్ మీటింగ్ కు అటెండ్ అయిన వీరు… తిరిగివస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. డ్రైవర్ స్టీరింగ్ పై కంట్రోల్ కోల్పోవడంతో బస్సు బోల్తాపడిందని తెలిపారు. గాయపడిన వారిని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు చేర్చామన్నారు. విషయం తెలిసిన వెంటనే ఝార్కండ్ కార్మికశాఖ మంత్రి రాజ్‌ పలివార్‌  బాధితులకు రూ.50 వేల తక్షణ సాయం అందిస్తున్నట్లు చెప్పారు.