యూపీలో మరో రోడ్డు ప్రమాదం..ట్రక్కును ఢీకొన్న బస్సు..రెండు వెహికల్స్ మంటల్లో దగ్ధం

యూపీలో మరో రోడ్డు ప్రమాదం..ట్రక్కును ఢీకొన్న బస్సు..రెండు వెహికల్స్ మంటల్లో దగ్ధం

ఉత్తరప్రదేశ్లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది..అమేధీలోని పుర్వాంచర్ ఎక్స్ ప్రెస్ హైవేపై బస్సు, ట్రక్కును ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బస్సు పూర్తిగా కాలిపోయింది. 

ఈ ప్రమాందలో డ్రైవర్తో సహా నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.  విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. 

Also Read : కుంభమేళాకు వెళ్తుండగా ప్రమాదం

గ్వాలియర్ నుంచి గోరఖ్పూర్కు ప్రయాణికులతో బస్సు వెళ్తుండగా అమేథీలోని శుక్ల బాజార్ థానా ప్రాంతంలో పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. టోల్గేట్ వద్ద ఆగివున్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.  గాయపడ్డ వారిని అంబులెన్స్లో సమీప ఆస్పత్రికి తరలించారు.