ఘోర రోడ్డు ప్రమాదం: సూర్యాపేట జిల్లాలో బస్సు బోల్తా.. 30 మందికి తీవ్రగాయాలు

ఘోర రోడ్డు ప్రమాదం:  సూర్యాపేట జిల్లాలో  బస్సు బోల్తా.. 30 మందికి తీవ్రగాయాలు

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. చింతపాలెం మండలంలో  ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.  ఈ ఘటనలో 20 నుంచి 30 మందికి గాయాలయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే...

కోదాడ డిపో కు చెందిన బస్సు  కోదాడ నుంచి చింత్రియాలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.  ఎదురుగా వస్తున్న బైక్​ ను తప్పించబోయి బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.  ఈ ఘటనలో 20 నుఏంచి 30 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను  మేళ్లచెరువు, హుజూర్​ నగర్ ఏరియా హాస్పటలకు 108 ద్వారా  తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో  బస్సులో 50 నుంచి 60 ప్రయాణికులు ఉన్నారు.  ఇంకా దీనికి సండంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. . .