
ఎండలు మండుతున్నాయి. జనాలు అనేక పనులపై బయటకు వెళుతుంటారు. బాటసారుల దాహం.. దప్పిక తీర్చేందుకు మల్కాజిగిరిలో మాజీ విద్యుత్ ఉద్యోగి గుండు వెంకటరావు జ్ఞాపకార్ధం మజ్జిగను పంపిణి చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా రహదారి వెంట ప్రయాణించే ప్రజల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ పంపిణీ చేశామన్నారు ఆయన కుటుంబసభ్యులు.
ఈ సందర్భంగా గుండు చిన్మయకుమార్ మాట్లాడుతూ.. ఎండాకాలంలో జనాల దాహాన్ని తీర్చేందుకు తమ తండ్రి జ్ఞాపకార్ధం మజ్జిగను పంపిణీ చేశామని తెలిపారు. మంచినీరు కంటే మజ్జిగను అందిచడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు .. ఇతర లవణాలు అందుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి కుమార్, సూర్యనారాయణ తదితరులున్నారు.