
హైదరాబాద్ ఎలక్ట్రిక్ వాహనాల(EV) తయారీకి హబ్గా మారుతోంది. చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ BYD హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొత్త ఈవీ కార్ల తయారీ కంపెనీ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 70వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ సిటీ సమీపంలో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
ప్రపంచ ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ లో BYD నంబర్ వన్ గా ఉంది. 2024లో ఈ కంపెనీ 107బిలియన్ డాలర్ల ఆదాయాన్ని చూసింది. ఇది టెస్లా కార్ల కంపెనీ ఆదాయం 97.7 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ.టెస్లా 1.79 మిలియన్ల బ్యాటరీ కార్లను తయారు చేస్తే BYD ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మోడళ్లతో సహా 4.27 మిలియన్ల వెహికల్స్ ను డెలివరీ చేసింది.
ALSO READ | టెస్లా కంటే బీవైడీకి ఎక్కువ రెవెన్యూ.. ఈ కారు ధర టెస్లా కారు ధరలో సగం..!
MEIL గ్రూప్ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్టెక్ ఇప్పటికే BYD టెక్నాలజీని ఉపయోగించి ఎలక్ట్రిక్ బస్సులను ఉత్పత్తి చేస్తోంది. ఇది ఇప్పటికే ఉన్న కనెక్షన్ను సూచిస్తుంది.BYD ఈ ప్రాజెక్టు ఓకే అయితే లక్షల్లో ఉద్యోగాలు వచ్చే అవకావం ఉంది. కొత్త టెక్నాలజీని పరిచయంతో భారతదేశ EV రంగాన్ని బలోపేతం అవుతుంది. ఈ విస్తరణ క్లీనర్ ఎనర్జీ సొల్యూషన్లకు మద్దతు ఇస్తూనే ప్రపంచ మార్కెట్లో భారతదేశం స్థానాన్ని మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. అయితే తెలంగాణలో BYD కంపెనీ ప్రతిపాదనను గతంలో కేంద్ర ప్రభుత్వం తిరస్కరించినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక రాయితీలు ఇస్తోంది. అన్ని రకాల ఎలక్ట్రిక వాహనాలకు రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులను 100శాతం మినహాయింపు అందిస్తోంది. ఇది 2026 డిసెంబర్ 31 వరకు చెల్లుబాటు అవుతుంది.