బైజూస్‌‌  విలువ ఇప్పుడు..‘సున్నా’

బైజూస్‌‌  విలువ ఇప్పుడు..‘సున్నా’

న్యూఢిల్లీ : ఒకప్పుడు 22 బిలియన్ డాలర్లు  (సుమారు రూ.1.83 లక్షల కోట్లు) పలికిన  ఎడ్‌‌టెక్ కంపెనీ బైజూస్ విలువ ప్రస్తుతం సున్నాకు పడిపోయిందని  కంపెనీ ఫౌండర్ బైజూ రవీంద్రన్ ఒప్పుకున్నారు. ‘దీని విలువ జీరో. ఏ వాల్యుయేషన్స్ గురించి మాట్లాడుతున్నారు? దీని విలువ జీరో ఇప్పుడు’ అంటూ ఆయన డైరెక్ట్‌‌గా తేల్చేశారు. బైజూస్ విస్తరణపై స్పందిస్తూ  ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఎడ్‌‌టెక్ సెక్టార్‌‌‌‌లో విస్తరించేందుకు 24 స్టార్టప్‌‌లను బైజూస్ కొనుగోలు చేసింది.

కానీ, ఈ ప్లాన్సే కంపెనీ కొంపముంచాయి. బైజూస్ 2022లో  తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. 40 కొత్త మార్కెట్లలో విస్తరించాలని కంపెనీ ఇన్వెస్టర్లు ప్రోత్సహించారని, ఉక్రెయిన్‌‌–రష్యా యుద్ధంతో ఈ ప్లాన్స్‌‌కు బ్రేక్ పడిందని అన్నారు. చిన్న సమస్య రాగానే బైజూస్ ఇన్వెస్టర్లు ప్రోసస్‌‌ వెంచర్స్‌‌, పీక్ ఎక్స్‌‌వీ, చాన్ జూకర్​బర్గ్‌‌ ఇనీషియేటివ్ పారిపోయారని అన్నారు.  ఇండియా నుంచి పారిపోలేదని, తన తండ్రి ట్రీట్‌‌మెంట్ కోసం దుబాయ్ వచ్చానని రవీంద్రన్ అన్నారు. బైజూస్‌‌ను ఎప్పటికైనా తిరిగి గాడిలో పెడతానని చెప్పారు.