
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం హాట్హాట్గా ప్రారంభమయ్యాయి. సభనుద్దేశించి లెఫ్టినెంట్గవర్నర్వీకే సక్సేనా ప్రసంగం తర్వాత ఢిల్లీ లిక్కర్ పాలసీపై కాగ్ రిపోర్ట్ను బీజేపీ సర్కారు ప్రవేశపెట్టింది. ఈ నివేదికను సీఎం రేఖాగుప్తా టేబుల్చేయగా.. దీనిపై చర్చకు స్పీకర్విజేందర్గుప్తా అనుమతించారు. సీఎంవో నుంచి అంబేద్కర్, మహాత్మాగాంధీ, భగత్సింగ్ఫొటోలు తొలగించారంటూ ప్రతిపక్ష ఆప్ నేతలు నిరసనకు దిగగా.. వారిని స్పీకర్సస్పెండ్చేశారు.
ఇదిలా ఉండగా.. 2021–-22లో ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) తీసుకొచ్చిన లిక్కర్పాలసీ కారణంగా ఢిల్లీ ప్రభుత్వానికి రూ.2,002 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు కాగ్ రిపోర్ట్లోవెల్లడించింది. ఈ పాలసీ వల్ల నాటి సర్కారు రూ.941.53 కోట్ల ఆదాయం కోల్పోయిందని పేర్కొన్నది. లైసెన్స్ ఫీజుల కింద మరో రూ.890.15 కోట్లు నష్టపోయిందని, మినహాయింపుల రూపంలో రూ.144 కోట్లు, సెక్యూరిటీ డిపాజిట్లు సరిగ్గా సేకరించకపోవడంతో రూ.27 కోట్లు లాస్ అయినట్టు వెల్లడించింది. మొత్తంగా ఈ నష్టం రూ.2 వేల కోట్లకు పైగా ఉందని తెలిపింది.
ఎక్స్పర్ట్ప్యానెల్ సిఫార్సులు పట్టించుకోలే..
లిక్కర్పాలసీలో మార్పులను సూచించడానికి ఏర్పాటు చేసిన ఎక్స్పర్ట్ప్యానెల్ సిఫార్సులను విస్మరించారని, కంప్లయింట్స్వచ్చినా బిడ్డింగ్ను అనుమతించారని, ఉల్లంఘనలకు ఎలాంటి జరిమానాలు విధించలేదని కాగ్ నివేదికలో వెల్లడించింది. దీంతో పాటు పాలసీ రూపకల్పనలోనూ పారదర్శకత పాటించలేదని తేల్చింది.ఈ విషయాలను నాటి డిప్యూటీ సీఎం, ఎక్సైజ్మంత్రి మనీశ్సిసోడియా దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని కాగ్ రిపోర్ట్వెల్లడించింది. కేబినెట్ఆమోదం లేకుండా.. లెఫ్టినెంట్ గవర్నర్ను సంప్రదించకుండానే ఆర్థికంగా భారీ ప్రభావాన్ని చూపే మినహాయింపులు, రాయితీలను ఇచ్చారని కాగ్రిపోర్ట్లో పేర్కొన్నది.
ఆప్ నేతల నిరసన..
సీఎం ఆఫీస్లో ఏర్పాటుచేసిన అంబేద్కర్, భగత్సింగ్ఫొటోలను తొలగించారంటూ సభలో ప్రతిపక్ష ఆప్నేతలు నిరసనకు దిగారు. ఎల్జీ వీకే సక్సేనా ప్రసంగిస్తున్న సమయంలో అడుగడుగునా అడ్డుపడ్డారు. ‘జై భీమ్’ నినాదాలతో హోరెత్తించారు. దీంతో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం ఆతిశీ సహా 15 మంది ఆప్ ఎమ్మెల్యేలను స్పీకర్విజేందర్ గుప్తా సభా కార్యకలపాల నుంచి ఒకరోజంతా సస్పెండ్చేశారు. అలాగే, సభను మరో రెండు రోజులు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు.