
విదేశాల్లో హయ్యర్ ఎడ్యుకేషన్కు వెళ్లే విద్యార్థుల సంఖ్య గత దశాబ్ద కాలంగా పెరుగుతోంది. కొవిడ్ ఎఫెక్ట్తో అబ్రాడ్ ఎడ్యుకేషన్కు కొంతకాలం ఆటంకాలు ఎదురైనా ఇప్పుడు మళ్లీ ఊపందుకుంది. ఏ దేశాల్లో ఎలాంటి కోర్సులకు డిమాండ్ ఉంది, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్యాట్రన్, ప్రస్తుత పరిస్థితులపై ఈ వారం..
ఫారిన్ చదువులపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపించింది. 2020 మార్చిలో మొదలైన కొవిడ్ ఎఫెక్ట్ అబ్రాడ్ స్టడీస్కు సిద్ధమైన స్టూడెంట్స్ను ఇబ్బందికి గురి చేసింది. ముఖ్యంగా విద్యార్థులకు సకాలంలో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ పూర్తికాకపోవడంతో యూనివర్సిటీల్లో అడ్మిషన్ సమస్యగా మారింది. చాలా దేశాలు సంవత్సరానికి మూడు సార్లు అడ్మిషన్స్ తీసుకుంటాయి. స్ప్రింగ్ సీజన్ (జనవరి–ఫిబ్రవరి), సమ్మర్ సీజన్ (మే), ఫాల్ సీజన్ (సెప్టెంబర్) లో ప్రవేశాలు కల్పిస్తారు. కానీ కొవిడ్ పాండమిక్తో అన్ని స్కూల్స్, కాలేజ్లు మూసివేయడంతో ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించలేదు. దీంతో అబ్రాడ్లో చదివేందుకు ప్లాన్ వేసుకున్న విద్యార్థులకు సమస్యగా మారింది. కరోనా సమయంలో చాలా దేశాలు తమ సరిహద్దులను మూసివేసి, విదేశీ ప్రయాణాలు నిలిపివేశాయి.
అడ్మిషన్స్ పెరుగుతున్నాయ్
కొవిడ్ ప్రభావంతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ విధించిన ఆంక్షలతో యూకే, కెనడా దేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరిగింది. గతంలో యూకేలో చదువు పూర్తయ్యాక స్టూడెంట్స్కు పోస్ట్ వర్క్ పర్మిట్ 6 నెలలు మాత్రమే ఉండగా, ఇప్పుడు 2 నుంచి 3 సంవత్సరాలకు పెంచింది. దీంతో యూకే వెళ్లడానికి విద్యార్థులు ఇంట్రస్ట్గా ఉన్నారు. కెనడా కరోనా సమయంలో విద్యార్థులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంతో ఇండియా నుంచి ఎక్కువ స్టూడెంట్స్ వెళ్తున్నారు. బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వెళ్లడంతో ఐటీ, ఫార్మా రంగాలకు చెందిన కంపెనీ హెడ్క్వార్టర్స్ ఐర్లాండ్కు తరలివెళ్లాయి. దీంతో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉండడంతో ఇండియన్ స్టూడెంట్స్ ఐర్లాండ్లో హయ్యర్ ఎడ్యుకేషన్ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. జర్మనీలో స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) కోర్సులకు డిమాండ్ ఉంది. యూరప్లోని ఫిన్లాండ్, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాల్లో ఐటీ, లా, డిజైన్, స్పోర్ట్స్ మేనేజ్మెంట్, టూరిజం అండ్ హాస్పిటాలిటి, ఎంబీఏ కోర్సుల్లో చేరేందుకు ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
ఎంబీఏకు జీమ్యాట్
యూఎస్ఏలో స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) కోర్సుల్లో మాస్టర్స్, పీహెచ్డీ చేయాలంటే మంచి అకడమిక్ మెరిట్తో పాటు జీఆర్ఈ ( గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామ్)లో మంచి స్కోర్ సాధించాలి. దీంతో పాటు ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రొఫిషీయన్సీ టెస్ట్ పాసవ్వాలి. జీఆర్ఈతో పాటు టోఫెల్, ఐఈఎల్టీఎస్, పీటీఈ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్తో కూడా యూనివర్సిటీల్లో అడ్మిషన్స్ పొందవచ్చు. అమెరికాలో ఎంబీఏ చేయాలంటే జీమ్యాట్ ( గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్అడ్మిషన్ టెస్ట్) తప్పనిసరి. జీఆర్ఈ, జీమ్యాట్ టెస్టులో వచ్చిన స్కోర్ ఆధారంగా యూఎస్ఏతో పాటు కెనడా, సింగపూర్, జర్మనీ దేశాల్లోని వర్సిటీల్లో అడ్మిషన్స్ కల్పిస్తున్నారు. కరోనా ప్రభావంతో చాలా వర్సిటీలు ఎంట్రన్స్ టెస్టులు పరిగణనలోకి తీసుకోకుండా అకడమిక్ మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పించాయి.
ఇండియన్స్ డ్రీమ్ యూఎస్ఏ
అబ్రాడ్ ఎడ్యుకేషన్ అంటే భారతీయులకు ఎక్కువగా గుర్తొచ్చేది అమెరికా. బైడెన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ భారత విద్యార్థులు అమెరికాలో చదివేందుకు పోటీ పడుతున్నారు. 2021లో రికార్డు స్థాయిలో 60వేల మంది విద్యార్థులు అమెరికా వర్సిటీల్లో అడ్మిషన్స్ పొందారు. కరోనా నేపథ్యంలో జీఆర్ఈ, జీమ్యాట్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సైతం లేకుండా అకడమిక్ మెరిట్ ఆధారంగా కొన్ని వర్సిటీలు అడ్మిషన్స్ కల్పించాయి. అబ్రాడ్లో చదువుకోవడానికి ఎడ్యుకేషన్ లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా సిద్ధంగా ఉండడంతో విదేశాల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది.
– యూఎస్ఏ, యూకే, కెనడా, జర్మనీ, ఫిన్లాండ్ వంటి దేశాల్లో స్టెమ్ ప్రోగ్రామ్స్తో పాటు హ్యూమానిటీస్, ఫైన్ ఆర్ట్స్ అండ్ కామర్స్ కోర్సులు కూడా అట్రాక్టివ్గా ఉంటూ మంచి ఉద్యోగ అవకాశాలు ఉండడంతో విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు.
విదేశాల్లో భారతీయ విద్యార్థులు
యూఏఈ 2,19,000
కెనడా 2,15,720
యూఎస్ఏ 2,11,930
ఆస్ట్రేలియా 92,383
సౌదీ అరేబియా 80,800
యూకే 55,465
ఒమన్ 43,600
న్యూజిలాండ్ 30,000
చైనా 23,000
జర్మనీ 20,810
స్టెమ్ కోర్సులకు డిమాండ్
అబ్రాడ్లో హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్లే విద్యార్థులు ఎక్కువగా స్టెమ్ కోర్సులైన ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరుతున్నారు. బెస్ట్ కెరీర్ కోసం డాటా ఎనలటిక్స్, బిజినెస్ ఎనలటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నానో టెక్నాలజీ, రోబోటిక్స్ ప్రోగ్రామ్స్లో చేరేందుకు ఇంట్రస్ట్గా ఉన్నారు. కొందరు ఫార్మాసీ, సైకాలజీ, లా, బేసిక్ సైన్స్ ప్రోగ్రామ్స్, ఇన్విరాన్మెంటల్ స్టడీస్లో జాయిన్ అవుతున్నారు.