గ్రూప్ 1 మెయిన్స్ ను వాయిదా వేయాలి..అభ్యర్థుల ధర్నా

గ్రూప్ 1 మెయిన్స్ ను వాయిదా వేయాలి..అభ్యర్థుల ధర్నా

అశోక్​నగర్​లో అభ్యర్థుల మెరుపు ధర్నా
జీఓ నంబర్​29ని సవరించాలని డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: ఈ నెల 21 నుంచి మొదలుకానున్న గ్రూప్–1 మెయిన్స్​పరీక్షలను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు డిమాండ్ చేశారు. గతంలో ప్రిలిమ్స్ పరీక్షల్లోని తప్పులను సవరించాలని కోరారు. ఈ మేరకు బుధవారం రాత్రి అశోక్ నగర్ లో మెరుపు ధర్నాకు దిగారు. జీఓ నంబర్ 29ని సవరించిన తర్వాతనే మెయిన్స్​పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఒకేసారి వందల మంది అభ్యర్థులు రోడ్డెక్కడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

 పోలీసులు అక్కడికి చేరుకొని అభ్యర్థులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు శివానంద స్వామి, జనార్దన్, ఇందిర నాయక్ మాట్లాడుతూ.. గ్రూప్–1 పరీక్షల్లో రిజర్వేషన్లు పాటించడం లేదని మండిపడ్డారు. జీఓ 29ని సవరించిన తర్వాతనే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన వారిని విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేశారు.