
హైదరాబాద్: ఎన్నికల సమయంలో పార్టీ మారిన వారిలో మెజార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. బీజేపీలో చేరి బరిలోకి దిగిన బీబీపాటిల్(జహీరాబాద్), పోతుగంటి భరత్( నాగర్ కర్నూల్), శానంపూడి సైదిరెడ్డి (నల్లగొండ), గోమాస శ్రీనివాస్ (పెద్దపల్లి), ఆరూరి రమేశ్(పెద్దపల్లి), సీతారాం నాయక్( మహబూబాబాద్) తదితరులు ఓటమి అంచుల్లోకి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన గడ్డం రంజిత్ రెడ్డి( చేవెళ్ల), దానం నాగేందర్( సికింద్రాబాద్), పట్నం సునీతా మహేందర్ రెడ్డి( మల్కాజ్ గిరి), నీలం మధు( మెదక్) వెనుకంజలో ఉన్నారు. బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ లో మూడో స్థానంలో ఉండటం గమనార్హం.