తెలంగాణలోనే కొనసాగుతాం..

తెలంగాణలోనే కొనసాగుతాం..
  • సెమీ కండక్టర్ల తయారీ సంస్థ కేన్స్  టెక్నాలజీ క్లారిటీ
  • అడ్వాన్స్  ఎలక్ట్రానిక్  యూనిట్  ప్రారంభోత్సవానికి సీఎంకు ఆహ్వానం

హైదరాబాద్ , వెలుగు: తెలంగాణలోనే కొనసాగుతామని సెమీ కండక్టర్ల తయారీ సంస్థ కేన్స్  టెక్నాలజీ తేల్చి చెప్పింది. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని ఆ సంస్థ సీఈవో రఘు  ఫణికర్  స్పష్టం చేశారు. ఈ నెల 23న కొంగరకలాన్ లో కేన్స్ సంస్థ అడ్వాన్స్ ఎలక్ట్రానిక్  యూనిట్ ను ప్రారంభించబోతున్నది.

ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఫణికర్  సోమవారం సచివాలయంలో కలిసి ఆహ్వానించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఓ శాట్  యూనిట్  ఇండియన్ సెమీ కండక్టర్  మిషన్  పరిశీలనలో ఉంది. ఐఎస్ఎం అనుమతి రాగానే ఓ శాట్​ యూనిట్  ఆపరేషన్లను ప్రారంభిస్తామని ఫణికర్  తెలిపారు.