గ్రామాల్లోనూ విస్తరిస్తున్న గంజాయి కల్చర్

గ్రామాల్లోనూ విస్తరిస్తున్న గంజాయి కల్చర్

అరెస్ట్​ చేసినా బెదరకపోవడంతో గంజాయి, డ్రగ్స్ పెడ్లర్స్‌‌‌‌ పై మరింత కఠిన చర్యలకు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్​ బ్యూరో(టీన్యాబ్‌‌‌‌) సిద్ధమైంది. 24 మంది పెడ్లర్స్​ ఆస్తులను  జప్తు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.  నిందితులపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌‌‌‌స్టాన్సెస్ యాక్ట్ (ఎన్‌‌‌‌డీపీఎస్‌‌‌‌)తో పాటు  ‘స్మగ్లింగ్ అం డ్ ఫారిన్ ఎక్స్చేంజ్​ మానిప్యులేటర్స్‌‌‌‌ యాక్ట్​’(- సఫెమా) ను అమలు చేస్తున్నది.  ఈ మేరకు చెన్నైలోని ‘సౌత్ ఇండియా సఫెమా కాంపిటెంట్ అథారిటీ’కి రిపోర్ట్ పంపించారు. 

గ్రామాల్లోనూ విస్తరిస్తోంది:

గంజాయి, డ్రగ్స్ కల్చర్‌‌‌‌ పట్టణాల నుంచి గ్రామాలకు పాకింది. గంజాయి మత్తుకు బానిసలైన యువత ఈజీ మనీ కోసం తామే సప్లయర్స్‌‌గా మారుతున్నారు. దీంతో హైదరాబాద్‌‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి చైన్‌‌ లింక్ పెరిగిపోతున్నది. ఇదే అవకాశంగా చేసుకుని గంజాయి, డ్రగ్స్ సప్లయర్స్​ ఆర్గనైజ్డ్‌‌ నెట్‌‌వర్క్‌‌ ఏర్పాటు చేసుకున్నారు.

విశాఖ, ఒడిశా ఏజెన్సీ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌‌ మీదుగా దేశవ్యాప్తంగా ట్రాన్స్‌‌పోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్‌‌తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఏజెంట్స్ నెట్‌‌వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. వీరి ద్వారా స్థానికంగా గంజాయి అమ్మకాలు జరుపుతూనే ఇతర రాష్ట్రాలకు ట్రాన్స్‌‌పోర్ట్ చేస్తున్నారు.