
- ఇద్దరు నిందితుల అరెస్టు
- ద్విచక్ర వాహనం, రెండు సెల్ఫోన్లు సీజ్
హుస్నాబాద్, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గంజాయిని శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. గంజాయి రవాణా అవుతోందనే పక్కా సమాచారం మేరకు సిద్దిపేట జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు, హుస్నాబాద్ పోలీసులతో కలిసి పట్టణ శివారులోని కరీంనగర్ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా కనిపించారు. వారి వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా సంచిలో ఉంచిన 1.500 గ్రాముల గంజాయి దొరికింది.
వారి వివరాలు ఆరా తీయగా హుస్నాబాద్కు చెందిన చుక్క అనిల్, హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వీర్లగడ్డతండాకు గుగులోత్సంతోష్ గా తెలిసింది. గంజాయిని ఎక్కడి నుంచి తెస్తున్నారని ప్రశ్నించగా తమకు వీర్లగడ్డతండాకు బూక్య రమేశ్అమ్మాడని ఒప్పుకున్నారు. వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకొని, టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనంతోపాటు రెండు సెల్ఫోన్లను సీజ్ చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.