న్యూఢిల్లీ: 2025–26 ఆర్థిక సంవత్సరంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం రూ.11.21 లక్షల కోట్లు కేటాయిస్తామని ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి క్యాపెక్స్ కోసం విధించుకున్న టార్గెట్ను కేంద్రం చేరుకోలేదు. ఈసారి రూ.10.18 లక్షల వరకు ఖర్చవుతాయని అంచనా. 2024లో పలు చోట్ల ఎన్నికలు జరగడం వల్ల 2–3 నెలలు కార్యకలాపాలు జరగలేదని, అందుకే టార్గెట్ను చేరుకోలేదని మంత్రి వివరణ ఇచ్చారు.
2024 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం క్యాపెక్స్ను 10 శాతం పెంచి రూ.10 లక్షల కోట్లకు చేర్చింది. వీటిలో రూ.9.5 లక్షల కోట్ల వరకు ఖర్చవుతాయని భావిస్తున్నారు. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు నెమ్మదించడంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం గత రెండేళ్లలో ప్రభుత్వం క్యాపెక్స్ను 30 శాతం దాకా పెంచింది. భౌతిక ఆస్తులను కొనుగోలు చేయడానికి క్యాపెక్స్ను ఉపయోగిస్తారు.