మణికొండలో కారు బీభత్సం.. నలుగురు కుర్రోళ్లను చితకబాదిన స్థానికులు

మణికొండలో కారు బీభత్సం.. నలుగురు కుర్రోళ్లను చితకబాదిన స్థానికులు

మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాల్ గూడలో థార్ కార్ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి తోటి వాహనదారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇతర వాహనదారులకు స్వల్ప గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వారు గంజాయి సేవించి వాహనం నడపటమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. 

ప్రమాదం జరిగిన సమయంలో కారులో నలుగురు యువకులు ఉన్నారు. ఘటన అనంతరం కారులోని నలుగురు యువకులను స్థానికులు చితకబాదారు. ఆగ్రహంతో కారు అద్దాలు పగల కొట్టారు. కారులో ఉన్న యువకులు గంజాయి సేవించి ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. వారిలో ఒకరు హైకోర్టు న్యాయవాదినని దభాయించినట్లు తెలిపారు. స్టేషన్ లోనూ వారు పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది.