
రైతుబంధు సమితి చైర్మన్కు 27.61 లక్షలతో కొత్త వెహికల్
ఫండ్స్ రిలీజ్ చేస్తూ జీవో జారీ
హైదరాబాద్, వెలుగు: మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రైతుబంధు చెక్కులను వెనక్కి ఇవ్వడం (గివిట్ అప్) లేదనే విమర్శలు ఉండగా… మరోవైపు గివిట్ అప్ ద్వారా వచ్చిన డబ్బులతో రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కోసం కొత్త కారు కొంటున్నారు. రూ.27.61 లక్షలతో ఇన్నోవా క్రిస్టా వెహికల్ కొనుగోలుకు ఫండ్స్ విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గివిట్ అప్ ద్వారా 2018 వానాకాలంలో వచ్చిన రూ.2.40 కోట్ల ఫండ్స్ నుంచి రూ.27.61 లక్షలను మంజూరు చేస్తూ వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
For More News..