
హైదరాబాద్: ఎల్బీనగర్ మన్సూరాబాద్లో కారు బీభత్సం సృష్టించింది. ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి మద్యం మత్తులో కారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఓ బైక్ను ఢీకొట్టాడు. కారు ఆపకుండా బైక్ను అలాగే ఈడ్చుకెళ్తు ముందున్న మరో కారును ఢీకొట్టాడు. ఈ ఘటనలో దివాన్స్ అనే యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రభాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించారు. గాయాల పాలైన యువకుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
ప్రమాదంలో కారు, బైక్ ధ్వంసం అయ్యాయి. మద్యం మత్తులో కారు నడిపిన ప్రభాకర్ రెడ్డికి కూడా గాయాలయ్యాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నగర వ్యాప్తంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తోన్న కొందరు మద్యం మత్తులో డ్రైవ్ చేసి ప్రమాదాలకు కారణం అవుతుండటంపై స్థానికులు మండిపడుతున్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ ఇతరుల ప్రాణాలు తీస్తోన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ALSO READ | మినీ బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. నలుగురు ఉద్యోగులు సజీవ దహనం